Friday 16 August 2013

మద్యం తాగించి రేప్ చేశారు..!

మద్యం తాగించి రేప్ చేశారు..!
05:21 PM on 16th August, 2013
మహిళలు ఎక్కడికెళ్లినా రక్షణలేకుండా పోతోంది. ఏదోవిధంగా వారు కామాంధుల బారిన పడుతున్నారు. విచారణ ఖైదీగావున్న తన భర్తను చూడడానికి వెళ్లిన మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ మధ్యకాలం బెంగాల్‌లో మహిళలపై అత్యాచారాల కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. హౌరా సమీపంలో తాజాగా ఓ ఘటన జరిగింది. మూడు పదుల వయసు గల ఓ మహిళ ఈ నెల 13న తన భర్తను చూడడానికి జైలుకి వెళ్లింది. అయితే, తగిన పత్రాలు లేకపోవడంతో భర్తను కలవలేకపోయింది. తాము సహాయం చేస్తామంటూ నలుగురు వ్యక్తులు ముందుకొచ్చి ఆమెను జైలు వెలుపల ఉన్న ఓ గదికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపారు. గదిలో ఆమె అచేతనావస్థలోపడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మద్యం తాగించి, తనపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురిని అరెస్టు చేశారు. అత్యాచారం చేసినవారిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. దీంతో అతన్ని జువనైల్ కోర్టుకు తరలించారు. మిగతా ముగ్గురికి కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది.

 

No comments:

Post a Comment